|
|
|
టెంకాయ చిప్ప
వావిలి కొలను సుబ్బారావు గారు గొప్ప రామ భక్తుడు. రామాయణము ఆంధ్రీకరించి "ఆంధ్ర వాల్మీకి " బిరుదాంకితులు అయ్యారు. సహజ కవి పోతన భాగవతము వెలసిన సీమ ఐన ఒంటిమిట్ట లోని కోదండ రామాలయమును పునరుద్ధరించడానికి నడుం బిగించారు. ఆయనది వజ్ర సంకల్పమే! అలనాడు రామదాసుగా ప్రజల మానస పద్మములందు నెలకొనిన కంచర్ల గోపన్నను ఆదర్శముగా తీసుకున్నారు , ఈ " వాసుదాసు ". విరాళాలను పోగు చేశారు, అయితే అందుకు ఆయన అనుసరించిన పద్ధతి విభిన్నముగా ఉండి , జనుల మన్ననలను అందుకున్నది. సంచులూ, హుండీలు వంటి వాటిని పట్టుకోలేదు వావిలికొలను సుబ్బారావు. కేవలం ఒక కొబ్బరి చిప్ప ను బిక్షా పాత్రగా గైకొన్నారు. ప్రజానీకం ఇచ్చిన విరాళాలతో , కోదండ రామాలయ పునర్నిర్మాణము దిగ్విజయముగా పూర్తి చేయ గలిగారు వాసు దాసు. తన బుజ్జి బిక్షా పాత్రపై ఎన లేని ప్రేమతో ఒక శతకమునే రచించారు. అది - " ఆంధ్ర వాల్మీకి హస్తంబు నందు నిలిచి రూప్యములు వేన వేలుగా ప్రోగు చేసి దమ్మిడైనను వాని , లో దాచుకొనక ధరణి జాపతి కర్పించి, ధన్యవైతివి కదా కమ్రగుణముల కుప్ప ! టెంకాయ చిప్ప!
|
| | |
|
|