అత్యంతాద్భుత చిత్రం "మాయాబజార్" గ్రాఫిక్ ఇంద్రజాల మహేంద్ర జాలాలతో ఇప్పుడు తెలుగు నాట విజయభేరీని మార్మోగిస్తూ న భూతో-న భవిష్యతి అని నిరూపిస్తూన్నది ఈ చిత్రరాజం.
ఐతే ఇందులో వింత ఏమిటంటే, ఈ కథ అసలు మహాభారతములో (జన రంజకమైన ఈ మహా ఇతిహాసము యొక్క అసలు పేరు "జయం") లేనే లేదు. ఇంకో ఆశ్చర్యకరమైన విశేషం కూడా ఉన్నది; అదేమిటంటే, సావిత్రి, అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి తారక రామారావు, ఎస్.వి.రంగారావు మున్నగు హేమాహేమీలు నటించిన ఈ సినిమాలో, పంచ పాండవులు కానరారు; వారు అజ్ఞాత వాసంలో ఉన్నారు కదా , అలాగే ఈ సినిమాలో కూడా వారి పాత్రలను అజ్ఞాతములో ఉంచినట్టి దర్శకత్వ ప్రతిభ, తర్వాతి తరాల సినీ రంగానికి మార్గ దర్శకత్వం వహించింది అనడంలో ఎలాటి సంశయమూ అక్కర లేదు.