గోవిందునికి తెలియని గోప్యాలా?
రాయలిచ్చిన కానుకలు కరిగించారో కనుమరుగు చేసారో? ప్రజాస్వామ్యంలో చెప్పడం కష్టం. ప్రజలు స్వామికి సమర్పించుకొన్న కానుకలు లెక్కలలోకి ఎక్కినవో లెక్కలేకుండా పోయినవో ప్రజలు ఎన్నుకున్న నాయకుల పాలన్లో చెప్పడం కష్టం నవరత్న ఖచిత కిరీటం కూడా కరిగించేస్తే మరి రత్నాలు ఎమైనట్లు? గోవిందునికె ఎరుక!!
తిరుమలలో పాలన కాదు భాగవతుల సేవ పరమావధి. ఇది తి.తి.దే.కు ఇంకా అంతు చిక్కని ధర్మసూక్షం. తిరుమల సంపదనిచ్చే ఒక కొండ ప్రభుత్వ పర్యవేక్షణ రూపంలో పట్టపగలు దోపిడికి నెలవు. మరి వేంకన్నకు తెలియదా? అని అంటారేమో!! ఆగండి...ఆగండి... ఈ దొంగల్ని దెశంలోకి వదిలితే ప్రమాదమని తన వద్దే ఉంచుకొని కలియుగ శిశుపాలులను పాపాలకు పరకాష్ట చేరుకోమంటున్నాడు!! ఎంత ఉదారుడు గోవిందుడు!!