మనిషికి ఆలోచించగలిగే శక్తి ఉండటం గొప్ప వరమైతే, విశ్లేషించగలగటం అందుకు పరాకాష్టగా చెప్పుకోవచ్చు. ఒకస్థాయికి ఎదిగిన పెద్దలలో కూడా కొన్ని లోపాలుండవచ్చు. ముఖ్యంగా వారి ఆలోచనారీతుల్లో. పాలని నీళ్ళను వేరుచేసి స్వీకరించగలిగే హంసలా, గొప్పవారి మంచిమాటలను స్వీకరిస్తూనే, లోపాలను తప్పక తిరస్కరించాలి. అదే మన విజ్ఞతకు నిదర్శనం. గులాబీ అందాన్ని ఎంతో ఆనందంగా ఆస్వాదించే మనం, గులాబీమొక్క ముళ్ళను సిగలో తురుముకోలేము కదా! మన వివేచన కూడా అలాగే సాగిపోవాలి.అంబేద్కర్ అనగానే గొప్ప మేథావిగా మనమదిలో మెదులుతాడు. అయితే ఆయన వ్యక్తీకరించిన అనేక భావాలు వాదనకు నిలబడేవి కావని మేధావులు గ్రహిస్తారు. ఉదాహరణగా, ఒక ముఖ్య విషయంలో ఆయన వ్యక్తపరిచిన భావాన్ని వివరిస్తాను.